బోధన్‌ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

బోధన్‌ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో సమావేశమై.... గులాబీ పార్టీలో కలకలం రేపిన బోధన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు....

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో సమావేశమై.... గులాబీ పార్టీలో కలకలం రేపిన బోధన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేలకు విలువే లేదని... ఆత్మాభిమానం చంపుకొని బతకలేనని అన్నారు. ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే గెలిస్తే... మంత్రి పదవి ఇవ్వలేదన్న షకీల్‌ అహ్మద్‌.... ఎంఐఎం చెప్పినట్లు టీఆర్‌ఎస్‌ వింటే ఎలా అంటూ ప్రశ్నించారు. అయితే, షకీల్‌... బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... రెండ్రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని బోధన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories