మీరు15 నిమిషాలను గుర్తు చేస్తే.. మేము సెకన్ల గురించి మాట్లాడాల్సి వస్తుంది: బండి సంజయ్

మీరు15 నిమిషాలను గుర్తు చేస్తే.. మేము సెకన్ల గురించి మాట్లాడాల్సి వస్తుంది: బండి సంజయ్
x
Highlights

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. 15 నిమిషాల సమయమిస్తే హిందువుల అంతు తేలుస్తాను'...

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. 15 నిమిషాల సమయమిస్తే హిందువుల అంతు తేలుస్తాను' అంటూ మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ మాటి మాటికి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంపై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మండిపడ్డారు.మీరు 15 నిమిషాల గురించి గుర్తు చేస్తే తాము సెకన్ల గురించి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.

దేశంలో నడిచేది హిందువుల రాజ్యం, అని బీజేపీకి ప్రజల మద్దతుందని అన్నారు. తమది ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే రాజకీయ పార్టీ అని అన్నారు. 2012 లో జరిగిన మతఘర్షణలు కరీంనగర్‌ ప్రజలు మర్చిపోలేరని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి చేస్తున్న కుట్రగా సంజయ్‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెబుతారని సంజయ్‌ చెప్పారు. మజ్లిస్‌ నాయకుడు డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు కరీంనగర్‌లో జరిగిన మతపరమైన అలర్లు ప్రజలకు తెలుసన్నారు. 2011లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన గొడవలను కరీంనగర్‌ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories