కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ బండి సంజయ్ అరెస్ట్

కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ బండి సంజయ్ అరెస్ట్
x
Highlights

కరీంనగర్‌లో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఎంపీ బండి సంజయ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్...

కరీంనగర్‌లో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఎంపీ బండి సంజయ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్‌ వరకు బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌ బస్టాండ్‌ దగ్గర చేరుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కార్యకర్తల మధ్య మోసుకొచ్చిన పోలీసులు ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి తరలించారు. ఇటు బండి సంజయ్‌ను తరలించే సమయంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీతో సహా మొత్తం 150 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories