బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. వారిని కాల్చి చంపాలి..

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. వారిని కాల్చి చంపాలి..
x
Highlights

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మర్కజ్ లో పాల్గొని వైద్య పరీక్షలకు సహకరించనివారిని కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. లేకపోతే...

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మర్కజ్ లో పాల్గొని వైద్య పరీక్షలకు సహకరించనివారిని కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైరస్ మరింత మందికి వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఢిల్లీ మర్కజ్ లో పాల్గొన్నవారిని వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రార్థన సభకు తెలంగాణ, ఏపీ నుంచే కాక, దేశంలో మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వ్యక్తులు హాజరయ్యారని వివరించారు.

అంతేకాక, ఇండోనేసియా సహా విదేశాల నుంచి ఎంతో మంది మత ప్రబోధకులు ఈ సభకు వచ్చి ప్రసంగించారని వెల్లడించారు. మార్చి 13 నుంచి 15 మధ్య ఈ సభ జరిగిందని, దేశంలో అప్పటికే కరోనా ముప్పు ఉన్నందున ఈ సభకు ఎలా అనుమతి ఇచ్చారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories