దోసకాయల కోసం ఎగబడ్డ జనం..ఎందుకో తెలుసా?

దోసకాయల కోసం ఎగబడ్డ జనం..ఎందుకో తెలుసా?
x
Cucumber
Highlights

ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తుండడంతో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు సరిగ్గా దొరకడంలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తుండడంతో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు సరిగ్గా దొరకడంలేదు. ఈ సమయంలో ఏ వస్తువు దొరికినా దాన్నే అమృతంలా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షాద్ నగర్ వాసులకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. బెంగళూరు రహదారి వెంట షాద్‌నగర్ వద్ద రోడ్డు పక్కన బస్తాలకు బస్తాలు దోసకాయల బస్తాలు దర్శనమిచ్చాయి. అది గమనించిన స్థానికులు ఈ కరువు కాలంలో వాటిని వదులుకోలేక గబగబా అందినకాడికీ తీసుకొని అక్కడ నుంచి వెల్లిపోయారు. హమ్మయ్య లాక్ డౌన్ ముగిసేంత వరకు రోజుకో కాయ చొప్పున పచ్చడికి ఉపయోగపడతాయంటూ హ్యాపీగా తీసుకెల్లిపోతున్నారు. ఆ దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి.

అసలు ఈ దోసకాయ బస్తాలు రహదారి పక్కకి ఎలా వచ్చాయనే విషయానికొస్తే కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు ఓ వాహనం దోసకాయల లోడ్ తో వచ్చింది. అయితే రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తుండడంతో ఎవరూ దోసకాయలను కొనుగోలు చేయలేదు. దీంతో ఆ వాహనం వచ్చిన దారి గుండానే తిరుగు ముఖం పట్టింది. ఇంకా ఆ దోసకాయలు బెంగులూరు దాకా తీసుకెల్లడం ఎందుకంటూ ఏం చేయాలో అర్థం కాక రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ బైపాస్ రహదారిపై పారబోసి వెళ్లారు. ఇంకేముంది అక్కడి జనాలకు ఫ్రీగా అన్నేసి బస్తాల దోసకాయలు దొరకడంతో ఎవరికి ఇష్టం వచ్చినన్ని వారు తీసుకెల్లిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories