కోడెల కాల్‌ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ

కోడెల కాల్‌ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ
x
Highlights

కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోందని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు ప్రకటించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు అనుమానమున్న...

కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోందని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు ప్రకటించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు అనుమానమున్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 12మందిని విచారించామన్న ఏసీపీ కేఎస్ రావు కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లు రికార్డు చేశామన్నారు. అలాగే కోడెల ఫోన్ కాల్ డేటాపై ఆరా తీస్తున్నామని, అదేవిధంగా కోడెల పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉందని తెలిపారు. ఇక సోషల్‌ మీడియాలో కోడెల కాల్‌ డేటాపై వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. కోడెల కుమారుడు శివరామ్‌ను త్వరలోనే విచారిస్తామని ఏసీపీ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories