రేవంత్ బ్లాక్‌ మెయిలింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ : బాల్క సుమన్

రేవంత్ బ్లాక్‌ మెయిలింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ : బాల్క సుమన్
x
Highlights

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బాల్క సుమన్‌ మాట్లాడుతూ గోపన్‌పల్లి భూకబ్జాలపై రేవంత్‌ రెడ్డి నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన వ్యవహారం దొంగేదొంగ అని అరిచినట్లుగా ఉందని నిప్పులు చెరిగారు బాల్క సుమన్‌.

ఇప్పటి వరకూ రేవంత్ చేసిన ఒప్పుకోవాలని, ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. కానీ భూముల కబ్జా విషయంలో రేవంత్‌ నిజస్వరూపం మరోసారి బట్టబయలైందన్నారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి ప్రతిసారి ఒకరి మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని. అతని బతుకంతా బ్లాక్‌మెయిల్‌ బతుకే అన్నారు. బ్లాక్‌ మెయిలింగ్‌కు చేయడంలో రేవంత్‌ రెడ్డి తరువాతే ఎవరైనా అయిన ఎద్దేవా చేసారు. ఆయన బ్లాక్ మెయిల్ బాస్ అని, బ్రాండ్‌ అంబాసిడర్‌ అని సుమన్‌ ధ్వజమెత్తారు.

రేవంత్‌ రెడ్డిపై ఇప్పటికే ఎన్నో భూ బాగోతాలు బయటకు వచ్చాయని ఆయన తెలిపారు. ఆ కేసులకు సంబంధించి ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఒక్కదానిపై కూడా వివరణ ఇవ్వలేదని సుమన్ పేర్కొన్నారు. కేటీఆర్‌ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి రేవంత్‌ కుట్రలు చేస్తున్నారని వాటిని, భయపడమని బాల్క సుమన్‌ స్పష్టం చేశారు. 2014, 2018 ఎన్నికల ఆఫిడవిట్లలో భూముల వివరాలను కేటీఆర్‌ స్పష్టంగా చూపించారని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories