ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: అసదుద్దీన్ ఒవైసీ

ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: అసదుద్దీన్ ఒవైసీ
x
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ
Highlights

హైదరాబాద్‌లోని దారుస్సలాంలోని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ భారీ బహిరంగ సభను శనివారం నిర్వహించారు.

హైదరాబాద్‌లోని దారుస్సలాంలోని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ భారీ బహిరంగ సభను శనివారం నిర్వహించారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని తెలిపారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే దేశంలో ఉన్న ముస్లిం సోదరులు తప్పక ఈ పని చేయాలని పిలుపునిచ్చారు. మనమంతా భారత పౌరులమని, భారతావని మనదని నినాదాలను చాటాలన్నారు. ఈ సందేశం మోదీ సర్కారుకు చేరాలని తెలిపారు.

ఎన్ఆర్సీ స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తోందన్నారు. ఎన్‌ఆర్సీ వల్ల నష్టమే కానీ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. దీని వలన రాష్ట్రాలకు రాష్ట్రాలే ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఈ దుస్థితి 70 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకొచ్చిందని, ముస్లిం పేరు ఎన్‌ఆర్సీలో లేకపోతే.. అతడి కుటుంబం ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఇది చాలా బాధాకరమైన విషయమని ఆ‍యన అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న గొడవలు హిందూ-ముస్లిం, బీజేపీ-మజ్లిస్‌ మధ్య కాదని, దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉందని ఆయన సందేశం ఇచ్చారు. అనంతరం రాజ్యాంగాన్ని అవమానపరిచేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు అన్నివర్గాలు ఒక్క ముందుకు వచ్చి పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం సభలో చివరి ఘట్టంగా ఈ కార్యక్రమానికి హాజరైన అందరితో రాజ్యాంగ ప్రవేశిక చదివించిన అసద్‌.. జాతీయ గీతాలాపనతో సభ ముగించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories