యథావిధిగా తెలంగాణ గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు

యథావిధిగా తెలంగాణ గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు
x
Highlights

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌ -2 ఇంటర్వ్యూలు యధావిధిగా కొనసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను...

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌ -2 ఇంటర్వ్యూలు యధావిధిగా కొనసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గానే ఉన్నాయని, అందులో జోక్యం అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ సమస్యను ఇంతటితో ముగిద్దామని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల ధర్మాసనం స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ గతంలో పలువురు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories