శంషాబాద్‌లో మరో దారుణం.. మహిళను తగులబెట్టిన దుండగులు

శంషాబాద్‌లో మరో దారుణం.. మహిళను తగులబెట్టిన దుండగులు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలపై అఘాయిత్యాలు, హత్యల సంఘటనలు రోజుకు ఒకటిచొప్పున వెలుగులోకి...

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలపై అఘాయిత్యాలు, హత్యల సంఘటనలు రోజుకు ఒకటిచొప్పున వెలుగులోకి వస్తున్నాయి. ఇకపోతే వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యా ఉదంతం మరవక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హృదయవిదారకరమైన సంఘటన హైదరాబాద్ నగర శివార్లలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే హైదరాబాద్ పట్టన నగరశివార్లలోని శంషాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఎవరో గుర్తుతెలియని మహిళని సిద్దులగుట్ట ప్రాంతంలోని బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో తగులబెట్టారు. బంగారు మైసమ్మ ఆలయం వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన మహిళ వయస్సు 35 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళను అరగంట క్రితమే హత్య చేసి నిప్పుపెట్టినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మహిళ మృతదేహం 60శాతం కాలిపోవడంతో 108లో మృతదేహాన్నిఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన మహిళ వివరాలు తనని ఎవరు, ఎందుకు చంపేశారన్న విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories