వ్యక్తిపై చెప్పుతో దాడి చేసిన ప్రభుత్వ అధికారిణి

వ్యక్తిపై చెప్పుతో దాడి చేసిన ప్రభుత్వ అధికారిణి
x
వ్యక్తిపై చెప్పుతో దాడి చేసిన ప్రభుత్వ అధికారిణి
Highlights

ఓ వ్యక్తిపై ప్రభుత్వాధికారిణి చెప్పు తీసి విసిరింది. మరో చెప్పుతో ఆ వ్యక్తిని అందరూ చూస్తుండగా ఇష్టం వచ్చినట్లు కొట్టింది. లంచం ఇవ్వనందుకు తనపై ఆ...

ఓ వ్యక్తిపై ప్రభుత్వాధికారిణి చెప్పు తీసి విసిరింది. మరో చెప్పుతో ఆ వ్యక్తిని అందరూ చూస్తుండగా ఇష్టం వచ్చినట్లు కొట్టింది. లంచం ఇవ్వనందుకు తనపై ఆ అధికారిణి చెప్పులతో దాడి చేసిందని బాధిత వ్యక్తి తెలిపాడు.

ఇంటి నిర్మాణం కోసం అనుమతి కావాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు చెందిన ఓ అధికారిణికి దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతులు ఇవ్వకుండా లంచం ఇవ్వాలని ఆమె వేధించిందని దీంతో న్యాయస్థానానికి వెళ్లి, అనుమతి కోసం ఆర్డర్లు తెచ్చుకున్నానని తెలిపాడు.

అయినప్పటికీ అధికారిణి నుంచి స్పందన లేకపోవడంతో అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. అది తెలిసి ఇంటి నిర్మాణం పరిశీలించేందుకు అధికారులు వచ్చారు. అనుమతులు లేకుండా ఎందుకు నిర్మిస్తున్నావని ప్రశ్నించారు. అనుమతులు మంజూరు చేయాలని వారిని మరోసారి కోరాడు దశరథ రామిరెడ్డి. అయితే అధికారిణి లంచం అడిగిందని దశరథ రామిరెడ్డి ఆరోపిస్తున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె నన్నే లంచం అడిగానని అంటావా? అంటూ చెప్పులతో దాడి చేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories