కామారెడ్డి బస్టాండ్‌లో విషాదం

కామారెడ్డి బస్టాండ్‌లో విషాదం
x
Highlights

కామారెడ్డి బస్టాండ్‌లో విషాదం జరిగింది. ప్లాట్‌ఫామ్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదానికి నిండు ప్రాణం బలైంది. ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యం...

కామారెడ్డి బస్టాండ్‌లో విషాదం జరిగింది. ప్లాట్‌ఫామ్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదానికి నిండు ప్రాణం బలైంది. ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు మృతుని బంధువులు చెప్తున్నారు. కామారెడ్డి డిపోకి చెందిన ఏపీ 29 Z 33 -15 నెంబర్‌ గల ఆర్టీసీ బస్సు JBS కి బయలుదేరేందుకు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో.. ప్లాట్‌ఫామ్‌పై కూర్చున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పరిదుపేట గ్రామానికి చెందిన 35 ఏళ్ల లక్ష్మణ్‌.. అక్కడికక్కడే చనిపోయాడు. బస్సు డ్రైవర్‌ తప్పిదంతోనే నిండు ప్రాణం బలైందని ప్రయాణికులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories