Amaravati Farmers: మేడారం జాతరకు అమరావతి రైతులు.. ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న అమరావతి మహిళ !

Amaravati Farmers: మేడారం జాతరకు అమరావతి రైతులు.. ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న అమరావతి మహిళ !
x
Highlights

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు మేడారం జాతరకు తరలివచ్చారు. అమరావతి రాజధానిగా పరిపాలన సాగాలని వారు అమ్మవారిని...

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు మేడారం జాతరకు తరలివచ్చారు. అమరావతి రాజధానిగా పరిపాలన సాగాలని వారు అమ్మవారిని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానులు వద్దని, అమరావతే ముద్దని అమ్మవారిని వేడుకున్నారు. తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని కోరుతూ నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులు కన్నీరు పెట్టుకున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం అక్కడే ఉన్న ఎమ్మెల్యే సీతక్కను కలుసుకున్నారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఎమ్మెల్యే సీతక్క కాళ్లు పట్టుకుని తమ సమస్యను తీర్చాలని కోరింది. ఆమెను ఎమ్మెల్యే సీతక్క ఓదార్చారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories