సమత కేసులో తుదితీర్పు ఈ నెల 30కి వాయిదా

సమత కేసులో తుదితీర్పు ఈ నెల 30కి వాయిదా
x
సమత కేసులో తుదితీర్పు ఈ నెల 30కి వాయిదా
Highlights

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో తుదితీర్పు ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. కుమ్రంబీమ్ జిల్లా ఎల్లాపటార్‌ గ్రామంలో జరిగిన...

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో తుదితీర్పు ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. కుమ్రంబీమ్ జిల్లా ఎల్లాపటార్‌ గ్రామంలో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు నేడు తుదితీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉండటంతో వాయిదా వేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.

కుమ్రంబీమ్ జిల్లా ఎల్లాపటార్‌లో ముగ్గురు నిందితులు సమతను గ్యాంగ్‌ రేప్ చేసి హత్య చేశారు. కేసు విచారణ కోసం డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు డిసెంబర్ 14న 90 పేజీల చార్జ్‌ షీటును దాఖలు చేశారు. 40 మంది సాక్షుల్లో 20మందిని డిసెంబర్ 23 నుంచి 31 వరకు కోర్టు విచారించింది. నిందితుల తరపున వాదించడానికి న్యాయవాదులు ముందుకు రాకపోవడంతో కోర్టు న్యాయవాది రహీంను నియమించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories