వంతెన లేక అష్టకష్టాలు..మృతదేహంతో వాగు దాటుతూ కన్నీళ్లు

వంతెన లేక అష్టకష్టాలు..మృతదేహంతో వాగు దాటుతూ కన్నీళ్లు
x
Highlights

ఆదిలాబాద్‌ జిల్లా గుబిడి గ్రామస్తులను వాగు కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు గుబిడి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగులో...

ఆదిలాబాద్‌ జిల్లా గుబిడి గ్రామస్తులను వాగు కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు గుబిడి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగులో మోస్తరు ప్రవాహం వస్తే చాలు గ్రామానికి వాహన రాకపోకలు నిలిచిపోతున్నాయి. దాంతో గ్రామస్తులు ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సి వస్తోంది.

అనారోగ్యంతో ఆస్పత్రిలో మరణించిన బాలిక మృతదేహాన్ని తరలించడంలో కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడ్డారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అంబులెన్స్ అక్కడివరకు వచ్చి ఆగిపోయింది. దాంతో కుటుంబ సభ్యులే మోకాళ్ల లోతు నీటిలో స్ట్రెచర్‌‌పై బాలిక మృతదేహాన్ని మోసుకొచ్చారు.

అయితే, ఏళ్ల తరబడి ఇలాంటి కష్టాలే పడుతున్నామని గుబిడి గ్రామస్తులు వాపోతున్నారు. వాగుపై వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలకు, అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories