విషాదం.. మృతశిశువును వెలికితీయబోయి మృత్యుఒడికి..

విషాదం.. మృతశిశువును వెలికితీయబోయి మృత్యుఒడికి..
x
విషాదం.. మృతశిశువును వెలికితీయబోయి మృత్యుఒడికి..
Highlights

నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలో విషాదం చోటు చేసుకుంది. నీళ్ల కుంటలో పడివున్న మృత శిశువును తీసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ...

నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలో విషాదం చోటు చేసుకుంది. నీళ్ల కుంటలో పడివున్న మృత శిశువును తీసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించారు. వెంకట్‌ అనే వ్యక్తి మృతదేహంతో పాటు పసికందు మృతదేహాన్ని కూడా వెలికితీశారు. చనిపోయిన వ్యక్తి వెంకట్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చనిపోయిన పసికందు విషయంలో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన చిన్నారి తల్లి సుజాత తన బిడ్డను తానే చంపి నీటి కుంటలో పడేసిందా ?చనిపోయిన తర్వాత నీటి కుంటలో పడేసిందా ? అనే విషయం తేలాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే ఈ విషయంపై క్లారిటీ రానుందని పోలీసులు చెబుతున్నారు. చిన్నారిని పెంచలేకనే నీటి కుంటలో పడేసిందని స్థానికులు భావిస్తున్నారు. పేదరికం కారణంగానే సుజాత ఈ ఘోరానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories