నేను లంచం తీసుకొను... బోర్డు తగిలించిన అధికారి..

‘నేను లంచం తీసుకోను’.. ఆఫీసులో బోర్డు పెట్టిన ప్రభుత్వ అధికారి!
x
‘నేను లంచం తీసుకోను’.. ఆఫీసులో బోర్డు పెట్టిన ప్రభుత్వ అధికారి!
Highlights

'నేను లంచం తీసుకోను'.. ఆఫీసులో బోర్డు పెట్టిన ప్రభుత్వ అధికారి!

ప్రభుత్వ ఆఫీసులో లంచాలు తీసుకోకుండా పనులు జరగడం అనేది ఈరోజుల్లో చాలా అసాధ్యంగా మారిపోయింది. కొందరు లంచాలు తీసుకున్న సరే పని చేస్తారన్న నమ్మకం కూడా పోయింది. అయితే నేను లంచం తీసుకొనని ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా బోర్డు తగిలించాడు. ఈ సంఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీసులో కమర్షియల్ ఏడీఈగా పనిచేస్తున్న పోడేటి అశోక్ నేను లంచం తీసుకోనని బోర్డు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. మనం నిజాయితిగా పనిచేస్తే అసలు వ్యవస్థలో అవినీతి జరగదు అని నమ్ముతున్నని అయన అన్నారు.

అబ్దుల్లాపూర్ MRO విజయారెడ్డి హత్య తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేసేందుకు అధికారులు భయపడుతున్నారు. కొందరు లోపలోకి రానివ్వకుండా తాడుని కట్టి పది మీటర్ల దూరంలో నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మరి కొందరు కిటికీల నుండి దరఖాస్తులను తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో పోడేటి అశోక్ నేను లంచం తీసుకోనని బోర్డు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories