టిక్‌టాక్‌ సరదా : చెరువులో మునిగి శవం అయ్యాడు ..

టిక్‌టాక్‌ సరదా : చెరువులో మునిగి శవం అయ్యాడు ..
x
Highlights

ఇద్దరు యువకులు సరదాగా నీటిలోకి దిగారు. ఈత కొడుతున్నారు. అంతటితో ఆగకుండా టిక్‌టాక్‌ వీడియో తీసేందుకు ప్రయత్నించారు. చివరికి ఆ సరదా కాస్తా.. ప్రాణాల...

ఇద్దరు యువకులు సరదాగా నీటిలోకి దిగారు. ఈత కొడుతున్నారు. అంతటితో ఆగకుండా టిక్‌టాక్‌ వీడియో తీసేందుకు ప్రయత్నించారు. చివరికి ఆ సరదా కాస్తా.. ప్రాణాల మీదకు తెచ్చింది. చివరికి నీటిలో ఊపిరాడక ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగర శివార్లలోని ఓ చెరువులో జరిగింది.

సంగారెడ్డికి చెందిన యువకుడు నర్సింహ, అతనికి వరుసకు ప్రశాంత్‌.. ఇద్దరూ కలిసి దూలపల్లి దుమార్‌ చెరువులో దిగారు. సరదాగా ఇద్దరు కలిసి జలకాలాడుతున్నారు. ఆపై నీళ్లలోనే టిక్‌టాక్‌ వీడియో తీసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఈత రాక నర్సింహ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో భయపడిన ప్రశాంత్‌.. స్థానికులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories