దూసుకెళ్తున్న కారు .. ఏడో రౌండ్‌లో 14,300 ఓట్ల మెజార్టీ..

దూసుకెళ్తున్న కారు .. ఏడో రౌండ్‌లో 14,300 ఓట్ల మెజార్టీ..
x
Highlights

రాజకీయ పరిశీలకులతో పాటూ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నహుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. ఈరోజు (అక్టోబర్ 24) ఉదయం 8 గంటలకు...

రాజకీయ పరిశీలకులతో పాటూ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నహుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. ఈరోజు (అక్టోబర్ 24) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 7 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. అధికార టీఆరెస్ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏడో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. ఏడో రౌండ్‌ పూర్తయ్యేసరికి సైదిరెడ్డికి 14,300 ఓట్ల మెజార్టీ వచ్చింది. రౌండ్‌ రౌండ్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆధిక్యం పెరిగిపోతోంది. కారు వేగంతో దూసుకెళ్తుంటే.. కాంగ్రెస్‌, బీజేపీలు వెనుకంజలో ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories