తెలంగాణలో 68 మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణలో 68 మంది డీఎస్పీల బదిలీ
x
Highlights

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి నుండి 14 మందితో సహా 68 పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి నుండి 14 మందితో సహా 68 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు (డీఎస్పి) (సివిల్), క్రైమ్ ఇన్వెస్ట్ గేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) నుండి ముగ్గురిని శుక్రవారం బదిలీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం భారి స్థాయిలో డీసీపీ, అడిషనల్‌ ఎస్పీ, ఏసీపీ, డీఎస్‌పీల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ) మహేందర్‌రెడ్డి జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 50 అడిషనల్‌ ఎస్పీల బదిలీలు జరిగాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఏడుగురు అధికారుల బదిలి జరుగగా వారి స్థానంలో నూతన సిబ్బందిని నియమించారు. శాంతిభద్రతలు, ఇంటలిజెన్స్, ఎస్‌ఐబీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 68 అధికారుల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన 20 మంది అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏసీపీలుగా పని చేస్తూ అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతి పొందిన గ్రూపు–1 అధికారులకు వీరితో పాటే పోస్టింగ్‌ ఇచ్చారు.

పోస్టింగ్ వివరాలు : వై నరసింహరెడ్డి (అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఎసిపి), మల్కాజ్‌గిరి, ఆర్‌జి శివ మారుతి (ఎసిపి, ఆసిఫ్‌నగర్), పి వెంకటరమణ (ఎసిపి గోపాల్‌పురం), ఎం.గంగాధర్ (డిఎస్‌పి, సిఐడి).



Show Full Article
Print Article
More On
Next Story
More Stories