తెలంగాణలో ఈ రోజు 66 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో ఈ రోజు 66  కరోనా కేసులు నమోదు
x
Highlights

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ రోజు 66 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల...

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ రోజు 66 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1920కి పెరిగింది. సోమవారం మరో 72 బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ముగ్గురు చనిపోయారు. ఇప్పటి వరకు 1164 మంది డిశ్చార్జి అయ్యారు. దవాఖానల్లో 700 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 56కు పెరిగింది. ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డిలో 1 కేసులు ఉన్నాయి. 15 మంది ఇతర రాష్ట్రాల వాళ్లు కాగా, ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. మిగిలిన 18 మంది విదేశాల నుంచి వచ్చినవాళ్లు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories