డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులకు కోర్టు షాక్

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులకు కోర్టు షాక్
x
Highlights

ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న కానీ మందుబాబుల్లో కొంచెం కుడా మార్పు అనేదే రావడం లేదు. సాయంత్రం ఆరు గంటలకే తనిఖీలు చేసి...

ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న కానీ మందుబాబుల్లో కొంచెం కుడా మార్పు అనేదే రావడం లేదు. సాయంత్రం ఆరు గంటలకే తనిఖీలు చేసి వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. అయినా మందుబాబుల్లో మార్పులు రాకపోవడంతో కేసులు నమోదు చేసి ఏకంగా కోర్టులకు తరలిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో కోర్టులు శిక్షలు విధిస్తున్నే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందు బాబులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. 480 మంది మందుబాబులకు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు.. 62 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసింది. 31 మందికి మూడురోజులు, 142 మందికి రెండు రోజులు జైలు శిక్ష విధించింది. 257 మంది కోర్టు సమయం ముగిసే వరకు నిలబడి ఉండాలని జడ్జి ఆదేశించారు. ఇద్దరికి జీవితకాలంరద్దు చేసిందికోర్టు. సో ఇప్పటికైన మందు బాబులు డ్రంకెన్ డ్రైవ్ చేసేవారిలో మార్పు వస్తుందా చూడాలి మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories