తెలంగాణలో ఒక్క రోజే 213 పాజిటివ్ కేసులు, నలుగురు మృతి..

తెలంగాణలో ఒక్క రోజే 213 పాజిటివ్ కేసులు, నలుగురు మృతి..
x
Highlights

తెలంగాణలో తగ్గినట్టే తగ్గి కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. నిన్న కొత్తగా మరో 213 కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటిలో 165 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ...

తెలంగాణలో తగ్గినట్టే తగ్గి కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. నిన్న కొత్తగా మరో 213 కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటిలో 165 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా, జనగామ, కామారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, ఆసిఫాబాద్, పెద్దపల్లిలలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. కరీంనగర్‌లో 6, మెదక్‌లో 13, మేడ్చల్‌లో 3, నిజామాబాద్‌లో 2, రంగారెడ్డిలో 16, సంగారెడ్డిలో 2 కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5406కు చేరుకుంది. కోవిడ్‌ 19 కారణంగా నిన్న నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 191 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. నిన్న చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకుని 261 మంది బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 3027 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 2188 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories