టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ 2018 సంవత్సరాన్ని అత్యంత విజయవంతంగా ముగించాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల మోతతో తనకు తానే సాటిగా నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా కొహ్లీ ఆల్-ఇన్-వన్ షో పై స్పెషల్ ఫోకస్. విరాట్ కొహ్లీ ఆధునిక క్రికెట్లో తిరుగులేని మొనగాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ 2018 సంవత్సరాన్ని అత్యంత విజయవంతంగా ముగించాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల మోతతో తనకు తానే సాటిగా నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా కొహ్లీ ఆల్-ఇన్-వన్ షో పై స్పెషల్ ఫోకస్. విరాట్ కొహ్లీ ఆధునిక క్రికెట్లో తిరుగులేని మొనగాడు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఇన్ స్టంట్ వన్డే క్రికెట్ ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ ఫార్మాట్ ఏదైనా తనకు తేడా లేనేలేదని పరుగుల మోత మోగించడమే తనకు తెలిసిన విద్య అని చాటి చెప్పాడు.
గత ఏడాది కాలంలో అత్యధికంగా పరుగులు, సెంచరీలు సాధించడమే కాదు టెస్ట్, వన్డే క్రికెట్ ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా నిలిచాడు. 2018 జనవరిలో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ద్వారా పరుగుల జైత్రయాత్ర ప్రారంభించిన కొహ్లీ ఇంగ్లండ్, విండీస్, సఫారీ, కంగారూ సిరీస్ ల్లో అత్యుత్తమంగా రాణించాడు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో కొహ్లీ సెంచరీతో సహా మొత్తం 286 పరుగులు సాధించడం ద్వారా టాప్ రన్ గెటర్ గా నిలిచాడు. ఆ తర్వాత సఫారీలతో జరిగిన వన్డే, టీ-20 సిరీస్ ల్లో కలసి కొహ్లీ మొత్తం 558 పరుగులతో చెలరేగిపోయాడు. మొత్తం మూడు ఫార్మాట్లలోనూ కలసి కొహ్లీ 871 పరుగులతో వావ్ అనిపించుకొన్నాడు.
2018 ఇంగ్లండ్ టూర్ లో సైతం కొహ్లీ తన దూకుడుకొనసాగించాడు. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో 149 పరుగుల స్కోరుతో శతకం బాదిన కొహ్లీ మూడుఫార్మాట్ల సిరీస్ లో ఏకంగా 894 పరుగులతో నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా నలిచాడు. వన్డే సిరీస్ లో రెండు సెంచరీలతో సహా 453 పరుగులు, టెస్ట్ , వన్డే సిరీస్ లో 637 పరుగులతో కొహ్లీ అగ్రస్థానం సంపాదించాడు. ఇక ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా జరిగిన తీన్మార్ టీ-20 సిరీస్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లో కొహ్లీ 61 పరుగులతో సిరీస్ సమం చేయటంలో ప్రధానపాత్ర వహించాడు.
అంతేకాదు ఆసీస్ తో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోనూ కొహ్లీ తన పరుగుల వేటను కొనసాగించాడు. సిరీస్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదిక ముగిసిన తొలిటెస్టులో కేవలం 37 పరుగులు మాత్రమే చేసిన కొహ్లీ. పెర్త్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో మాత్రం మాస్టర్ క్లాస్ సెంచరీ సాధించాడు. 257 బాల్స్ లో కొహ్లీ 123 పరుగులు నమోదు చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో సైతం కెప్టెన్ కొహ్లీ 32 పరుగుల స్కోరుతో మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
వన్ డౌన్ పూజారాతో కలసి 3వ వికెట్ కు 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలిఇన్నింగ్స్ లో 82, రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ గా అవుట్ కావడం ద్వారా 2018 సీజన్ ను కొహ్లీ ముగించగలిగాడు. గత ఏడాది కాలంలో కొహ్లీ ఆడిన మొత్తం 13 టెస్టుల్లో 1322 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు శతకాలు సైతం ఉన్నాయి. ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో 14 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ ఏకంగా 1202 పరుగులు సాధించాడు. కొహ్లీ ఆడిన పది టీ-20 మ్యాచ్ ల్లో 211 పరుగులు తన ఖాతాలో జమ చేసుకొన్నాడు. ఓవరాల్ గా టెస్టుల్లో ఆరు వన్డేల్లో ఆరు సెంచరీలు సాధించడం ద్వారా విరాట్ కొహ్లీ తన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను మరింతగా పటిష్టం చేసుకోగలిగాడు. ప్రపంచ క్రికెట్ రారాజుగా నిలిచాడు. కొత్త సంవత్సరంలో సైతం కొహ్లీ ఇదేజోరును కొనసాగించడం ద్వారా టీమిండియాను తిరుగులేని విజేతగా నిలపాలని కోరుకొందాం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire