ఫైనల్ లో ఓటమి.. ప్లేయర్స్ కంటతడి

ఫైనల్ లో ఓటమి.. ప్లేయర్స్ కంటతడి
x
Shafali Verma
Highlights

మెల్‌బోర్న్‌ వేదికగా ఈరోజు జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు భారీ విజయాన్ని అందుకున్న సనగతి తెలిసిందే.

మెల్‌బోర్న్‌ వేదికగా ఈరోజు జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు భారీ విజయాన్ని అందుకున్న సనగతి తెలిసిందే.. దీనితో ఆసీస్ ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. వరుస విజయాలతో ఫైనల్ కి చేరిన భారత్ రన్నరప్‌ తో సరిపెట్టుకుంది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

అయితే ఫైనల్ లో ఓడిపోవడంతో భారత్ ప్లేయర్స్ స్టేడియంలోనే కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఫైనల్ లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని అనుకున్న అమ్మాయిలు ఘోర ఓటమిని తట్టుకోలేకపోయారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.. 16ఏండ్ల షఫాలీ కన్నీళ్లు పెట్టుకోగా ఆమెను తన సహచర క్రీడాకారిణి వర్మను ఓదార్చింది. ఫైనల్ లో జట్టు ఓడిపోయనప్పటికి జట్టుకు అభిమానుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది.. కాకపోతే ఈరోజు మహిళ దినోత్సవం కావడంతో మ్యాచ్ గెలిస్తే బాగుండేది కానీ మీ తెగువకి ఫిదా అని కామెంట్స్ పెడుతున్నారు.

ముందుగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అలిసా హేలీ(75 పరుగులు, 39 బంతుల్లో, 7 ఫోర్లు, 5 సిక్సులు)తో టీమిండియా బౌలర్లపై చెలరేగిపోయింది. ఇక మరో ఓపెనర్ మూనీ(78, 54 బంతుల్లో, 10 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచింది. దీనితో ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యచేధనకి బరిలోకి దిగిన భారత్ బాట్స్ మెన్స్ ఎక్కడ కూడా నిలకడగా ఆడలేకపోయారు. దిగిన భారత జట్టు కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

దీప్తి (33), హర్మన్‌ప్రీత్‌ (4), స్మృతి మంధాన (11), జెమిమా (0), షెఫాలీ వర్మ(2), వేదా (19), శిఖ పాండే (1), రీచా(18),రాధా (1) పరుగులు చేశారు. ఇక ఐదోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనందంలో ఆసీస్‌ జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories