సెలక్టర్లకు ధోనీ టెన్షన్!

సెలక్టర్లకు ధోనీ టెన్షన్!
x
Highlights

కూల్ ధోనీ ఇప్పుడు భారత సెలక్టర్లకు టెన్షన్ తెస్తున్నాడు. వరల్డ్ కప్ లో సెమీస్ ఓటమితో టీమిండియా కథ ముగిసింది. ఇక త్వరలో వెస్టిండీస్ పర్యటనకు సిద్ధం...

కూల్ ధోనీ ఇప్పుడు భారత సెలక్టర్లకు టెన్షన్ తెస్తున్నాడు. వరల్డ్ కప్ లో సెమీస్ ఓటమితో టీమిండియా కథ ముగిసింది. ఇక త్వరలో వెస్టిండీస్ పర్యటనకు సిద్ధం అవ్వాలి టీమిండియా. ఇప్పుడు ఈ పర్యటనకు ఆటగాళ్లను సెలక్ట్ చేసే పని మొదలు పెడుతున్నారు. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో సెలక్టర్లు ముంబై లో సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో ధోనీని సెలక్ట్ చేయడంపై సెలక్టర్లకు ఎటూ పాలుపోవడం లేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ బుమ్రాలకు రెస్ట్ ఇవ్వనున్నారు. అయితే, ధోనీ విషయం లోనే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ నుంచి వచ్చే కబురు కోసం సెలక్టర్లు ఎదురుచూస్తున్నారు. ధోనీ లేకపోతే పంత్ ఆ స్థానానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే, మాజీ క్రికెటర్లు మాత్రం నిర్ణయాన్ని ధోనీకే వదిలేయాలని చెబుతున్నారు. గతంలో టెస్టు క్రికెట్ నుంచి ధోనీ తప్పుకోవడానికి ముందు ఎమ్మెస్కే ప్రసాద్ చర్చలు జరిపాడు. ఇప్పుడు కూడా ఎమ్మెస్కే చొరవ తీసుకుని ధోనీతో మాట్లాడి, అతని మనసులో ఏముందో కనుక్కోవాలని మాజీలు సూచిస్తున్నారు. ఇక, ధోనీ సన్నిహితులు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే, వెస్టిండీస్ పర్యటనకు ధోనీ వెళ్లట్లేదని సమాచారం. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ఊహాగానాలకు ఇది కచ్చితంగా బలం చేకూర్చే అంశమే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories