ఇండియన్ టీమ్ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వన్డేలో చేసిన పరుగులను చేధించడానికి రోహిత్ కేవలం 26 పరుగుల వెనుకంజలో ఉన్నాడు .
భారత ఓపెనర్ బాట్స్ మెన్ రోహిత్ శర్మ మరో రికార్డుపైన కన్నేసాడు .. ఇండియన్ టీమ్ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వన్డేలో చేసిన పరుగులను చేధించడానికి రోహిత్ కేవలం 26 పరుగుల వెనుకంజలో ఉన్నాడు . భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా యువరాజ్ ఏడో స్థానంలో ఉన్నాడు. యువరాజ్ మొత్తం 304 వన్డేల్లో 8701 పరుగులు చేసాడు . ఇక రోహిత్ శర్మ 217 మ్యాచుల్లో 8676 పరుగులు చేశాడు. దీనితో యువరాజ్ పరుగులను బ్రేక్ చేయాలంటే రోహిత్ కి 26 పరుగులు అవసరం ఉన్నాయి ..ఇక ఈరోజు ఇండియా మరియు విండీస్ మధ్య జరగనున్న మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనతను సాధించాలని ఫాన్స్ ఆశిస్తున్నారు .
భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు: సచిన్ తెందుల్కర్ (18426), విరాట్ కోహ్లీ (11406), సౌరభ్ గంగూలీ (11363), రాహుల్ ద్రవిడ్ (10889), ఎంఎస్ ధోనీ (10773), మహ్మద్ అజారుద్దీన్ (9378), యువరాజ్ సింగ్ (8701), రోహిత్ శర్మ (8676).
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire