India vs New Zealand: మూడో రోజు కూడా ఆధిపత్యం కివీస్‌దే

India vs New Zealand: మూడో రోజు కూడా ఆధిపత్యం కివీస్‌దే
x
Highlights

వెల్లింగ్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి భారత్‌ నాలుగు వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది.

వెల్లింగ్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి భారత్‌ నాలుగు వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో ఆజింక్య రహానె(25; 67 బంతుల్లో 4x4), హనుమ విహారి(15; 70 బంతుల్లో 2x4) ఉన్నారు. ఇంకా భారత్ 39 పరుగుల వెనుకంజలో ఉంది... రెండో రోజు తిరిగి ఆటను ప్రారంభించిన కివీస్ జట్టును భారత్ 348 పరుగులకి ఆలౌట్ చేసింది.

మూడో రోజు ఆట ప్రారంభించిన తొలి బంతికే బుమ్రా బౌలింగ్‌లో వాట్లింగ్‌.. కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేతికి చిక్కాడు. దీంతో కివీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. అనంతరం ఇషాంత్‌ బౌలింగ్‌లో టిమ్‌సౌథీ (6) అవుట్ అయ్యాడు. దీనితో ఏడూ వికెట్లను కోల్పోయింది కివీస్ .. ఈ తరుణంలో కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌(43), కైల్‌ జేమీసన్‌(44) మరో వికెట్ పడకుండా జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కలిసి 71 పరుగులు జోడించారు.

ఆ తర్వాత వీరి జోడిని అశ్విన్‌ విడదీశాడు. ఆ కొద్దిసేపటికే గ్రాండ్‌హోమ్‌ను కూడా అశ్వినే వెనక్కి పంపించాడు. ఆ తర్వాత వచ్చిన అజాజ్‌ పటేల్‌(4), ట్రెంట్‌బౌల్ట్‌(38) పరుగులు చేశారు. చివరికి ఇషాంత్‌ బౌలింగ్‌లో ట్రెంట్‌బౌల్ట్ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీనితో 348 పరుగులకి కివీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 183 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకుంది. భారత బౌలర్లలో ఇషాంత్‌(5), అశ్విన్‌(3), షమి(1), బుమ్రా (1) వికెట్లు పడగొట్టారు.

తిరిగి రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన భారత్ కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పృథ్వీషా(14), పుజారా(11), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(19) తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు. మయాంక్‌ అగర్వాల్‌ (58) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తం మీద మూడోరోజు కూడా కివీస్ దే అధిపత్యం ప్రదర్శించింది. ఇక రహానె, హనుమ విహారి ఆటను బట్టి నాలుగో రోజు ఆట ఆధారపడి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories