ధోనీ నీ కూతురు జాగ్రత్త

ధోనీ నీ కూతురు జాగ్రత్త
x
Highlights

మిస్టర్ కూల్ ధోనీని అభిమానించని వారెవరు ఉంటారు? సాధారణ క్రికెట్ ప్రేమికుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ధోని అభిమానులే. అయితే ఇపుడు ధోని కూతురుకు...

మిస్టర్ కూల్ ధోనీని అభిమానించని వారెవరు ఉంటారు? సాధారణ క్రికెట్ ప్రేమికుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ధోని అభిమానులే. అయితే ఇపుడు ధోని కూతురుకు కుడా అభిమానులు తయారవుతున్నారు. అది కూడా సాధారణమైన వారేం కాదు. సెలబ్రిటీ లే. అంతే కాదు చాన్స్ దొరికితే ఆ చిన్నారిని ఎత్తుకుపోతాం అంటూ ధోనికే చెబుతున్నారు. ఇదంతా ఏమిటంటారా.. ఇదిగో మీ కోసమే ఆ వివరాలు..

చెన్నై సూపర్ కింగ్ సారధి ధోనికి ప్రీతి జింటా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం కింగ్స్ పంజాబ్‌కి యజమానిగా ఉన్న ఆమె తాజాగా ధోనీతో కలిసి ఫోటోకు ఫోజిచ్చింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఫోటోతో పాటు వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ధోనీ కూతురు జీవాపై తనకు అభిమానం పెరిగిపోతోందని కాబట్టి కిడ్నాప్ చేస్తానంటూ ప్రీతి జింటా ఇచ్చిన స్వీట్ వార్నింగ్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

''మిస్టర్ కూల్ మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. మీ అభిమానుల్లో నేను కూడా ఒకదాన్ని. మీపైనే కాకుండా మీ కూతురు జీవాపై కూడా ఈ మధ్య అభిమానం పెంచుకున్నాను. ప్రస్తుతం నా దృష్టి మీ చిన్నారిపై పడింది. నేను మీ కూతురు జీవాను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను. మీ కూతురు విషయంలో జాగ్రత్తగా ఉండండి' అని ప్రీతి ట్వీట్‌లో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories