ధావన్ న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడేనా?

ధావన్ న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడేనా?
x
Highlights

ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో కౌల్టర్‌నైల్‌ విసిరిన బంతి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ చేతికి బలంగా తగిలింది. చేయి నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించి...

ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో కౌల్టర్‌నైల్‌ విసిరిన బంతి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ చేతికి బలంగా తగిలింది. చేయి నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించి సెంచరీ సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు శిఖర్. ఈ క్రమంలో అతని వేలు వాచిపోయింది. దీంతో ఫీల్డింగ్ కు దూరంగా ఉన్నాడు. ధావన్ బదులు జడేజా ఆరోజు ఫీల్డ్ లో మెరిశాడు. ఇపుడు గబ్బర్ గాయానికి రేపు స్కానింగ్ చేయనున్నారు. స్కానింగ్ లో తేలే విషయాన్ని బట్టి గురువారం న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో గబ్బర్ అందుబాటులో ఉండేదీ లేనిది తేలిపోతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితిలో గబ్బర్ టీమిండియాకు అవసరం. అందుకే ఏవిధమైన ఇబ్బందీ కలగకూడదని భారత జట్టు మేనేజిమెంట్ తో పాటు అభిమానులూ కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories