ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేన...72ఏళ్ల కలను సాకారం చేసిన టీమిండియా

india
x
india
Highlights

సరికొత్త చరిత్ర, 72 ఏళ్లగా కంటున్న కల దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనత విరాట్ కోహ్లి సేన సాకారం చేసింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిచిన టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఈ ఘనతను సాధించింది.

సరికొత్త చరిత్ర, 72 ఏళ్లగా కంటున్న కల దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనత విరాట్ కోహ్లి సేన సాకారం చేసింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిచిన టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఈ ఘనతను సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో గావస్కర్‌ - బోర్డర్‌ సిరీస్‌ను భారత్‌ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే కురువడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 622 పరుగులతో డిక్లేర్‌ చేయగా, ఆసీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే ఆసీస్‌ ఫాలో ఆన్‌ ఆడాల్సి వచ్చింది. అయితే ఆటకు వర్షం అడ్డంకిగా రావడంతో ఐదో రోజు ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగిసింది. భారీ శతకం సాధించిన పుజారా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. ఒకవేళ వరుణుడు సహకరించి ఉంటే భారత్ 3-1తో సిరీస్ ను సొంతం చేసుకొని ఉండేది.

అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 31 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ 146 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఆపై మెల్‌ బోర్న్‌ టెస్ట్‌లో 137 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో చతేశ్వర్‌ పుజారా 521 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, బౌలింగ్‌ విభాగంలో బుమ్రా 21 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మహ్మద్‌ షమీ 16 వికెట్లు, ఇషాంత్‌ శర్మ 11 వికెట్లు తీశారు.

ఇక సిరీస్ విజయంతో భారత్ 72 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. టీమిండియా 1947లో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించింది. అప్పటి నుంచి పదిసార్లు అక్కడ పర్యటించింది. ఇప్పటి వరకు మొత్తంగా ఎనిమిది సార్లు ఓడితే, మరో మూడు సార్లు డ్రా చేసుకొని రావడం తప్ప ఒక్కసారి కూడా సిరీస్‌ గెలవలేదు. ఈ రికార్డును ఇప్పుడు కోహ్లీ సేన బ్రేక్ చేసింది. అలాగే, ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి. అంతేకాదు, ఈ సిరీస్‌లో భారత్ ఎన్నో రికార్డులను నమోదు చేసింది. అలాగే ఈ సిరీస్ ద్వారా రిషబ్ రూపంలో మంచి కీపర్ బూమ్రా రూపంలో పేస్‌కు నాయకుడు దొరికారు. ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా క్రీడా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories