Ind vs W I 2nd T20 : రెండో వికెట్ కోల్పోయిన భారత్

Ind vs W I 2nd T20 : రెండో వికెట్ కోల్పోయిన భారత్
x
rohit sharma
Highlights

తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 ఆరంభమైంది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్...

తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 ఆరంభమైంది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయింది. 3.1 ఓవర్లలో జట్టు స్కోరు 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ రాహుల్ (11 పరుగులు, 11 బంతుల్లో, 1ఫోర్ ) చేసి ఖ్యారీ పిర్రే బౌలింగ్ లో హెట్‌మైర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ( 15 పరుగులు,18బంతుల్లో,2 ఫోర్లు) పరుగులు చేసి 7.4 ఓవర్ల వద్ద జాసన్ హోల్డర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శివమ్ దూబే (34), కోహ్లీ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.

హైదరాబాద్ వేధికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు టీమిండియా 6వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియాల వెస్టిండీస్ మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేచించిన భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 94 పరుగులు,50బంతుల్లో, 6 ఫోర్లు, 6సిక్సులు)తో విండిస్ బౌలర్లపై విరుచుపడ్డాడు. విండీస్ ఉంచిన 208పరుగల లక్ష్యాన్ని మరో 8బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories