చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో టీమిండియా

చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో టీమిండియా
x
Highlights

కివీస్ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు నెగ్గిన కోహ్లీ సేన.. మరో...

కివీస్ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు నెగ్గిన కోహ్లీ సేన.. మరో మ్యాచ్‌లో నెగ్గితే.. సిరీస్‌ వశం అవనుంది. హామిల్టన్ వేదికగా ఈ మధ్యాహ్నం జరుగనున్న మ్యాచ్‌ను ఎలాగైనా గెల్చేందుకు సిద్ధమైంది. ఇక మన టీమ్ మాత్రం.. రాహుల్, శ్రేయస్ పైనే ఆశలు పెట్టుకుంది. మొదటి రెండు మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరు కుర్రాళ్లపైనే అంచనాలు పెట్టుకున్నారు.

ఇవాళ్టి మ్యాచ్‌కు.. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు మ్యాచ్‌లు కోల్పోయిన న్యూజీల్యాండ్ జట్టు.. హామిల్టన్ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి.. సిరీస్‌పై ఆశలు పెట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories