సంజు శాంసన్ షాక్: కివీస్ తో టీ 20 సిరీస్ కి భారత జట్టు ఎంపిక

సంజు శాంసన్ షాక్: కివీస్ తో టీ 20 సిరీస్ కి భారత జట్టు ఎంపిక
x
Highlights

కొత్త సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో ఆకట్టుకున్న భారత జట్టు ఆ తర్వాత సొంత గడ్డపై

కొత్త సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో ఆకట్టుకున్న భారత జట్టు ఆ తర్వాత సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కి సిద్దం అయింది. ఈ సిరీస్ అనంతరం న్యూజిలాండ్ పర్యటనకి బయలుదేరుతుంది భారత జట్టు. న్యూజిలాండ్ జట్టుతో తలపడే భారత జట్టు వివరాలను బీసీసీఐ సోమవారం ప్రకటించింది.

16 మందితో కూడిన భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటి ప్రకటించింది. శ్రీలంక సిరీస్ కి దూరం అయిన భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. రోహిత్ తో పాటు మహమ్మద్‌ షమీ కూడా జట్టులోకి వచ్చాడు. అయితే వికెట్ కీపర్ సంజు శాంసన్ షాక్ ఇచ్చారు సెలెక్టర్లు.. పుణే వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మూడో టీ-20లో అవకాశం వచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేదు సంజు శాంసన్..దీనితో అతనిపై వేటు పడింది.

మొత్తం ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ కి గాను సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు. న్యూజిలాండ్ జట్టుతో జనవరి 24వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుంది. ఆక్లాండ్ వేదికగా మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇక న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే వన్డే, టెస్ట్ సిరీస్ లకి గాను జట్టును ఎంపిక చేయాల్సి ఉంది.

ఇండియా టీ-20 జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్(కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories