వరల్డ్‌ టీ20: తొలిసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా

వరల్డ్‌ టీ20: తొలిసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా
x
వరల్డ్‌ టీ20: తొలిసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా
Highlights

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. నేడు సిడ్నీలో ఇంగ్లండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ని భారత్ ఆడాల్సివుండగా, వర్షం అడ్డుగా...

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. నేడు సిడ్నీలో ఇంగ్లండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ని భారత్ ఆడాల్సివుండగా, వర్షం అడ్డుగా నిలిచింది. దీంతో ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కాగా, గ్రూప్ దశలో మెరుగైన పాయింట్లు కలిగివున్న కారణంగా ఇండియా ఫైనల్స్ కు క్వాలిఫై అయిందని మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. కాగా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా రద్దయితే ఆదివారం ఇండియా వెర్సెస్ దక్షిణాఫ్రికా మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ పోరులో తలబడనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories