టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ

టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ
x
Highlights

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌కు ముందే భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌తో సిరీస్‌కు ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా...

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌కు ముందే భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌తో సిరీస్‌కు ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. హార్దిక్‌కు వెన‍్నునొప్పి కారణంగా సిరీస్‌ మొత్తానికి దూరమవుతున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పాండ్యా స్థానంలో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎవర్నీ ప్రకటించలేదు.. కానీ వన్డే సిరీస్‌కు మాత్రం రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు.

కాగా వరల్డ్‌కప్‌కు ముందు జరుగుతున్న ఈ కీలక సిరీస్‌ నుంచి పాండ్యా వైదొలగడం టీమిండియాకు టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తోంది. గత సెప్టెంబర్‌లో ఆసియాకప్‌లో పాకిస్తాన్‌ మ్యాచ్‌ తర్వాత వెన్నునొప్పి కారణంగా ఆ టోర్నీకి మొత్తం దూరమైన హార్దిక్‌ మరోమారు అదే వెన్నునొప్పి కారణంగా ఈ సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories