సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం ...

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం ...
x
Highlights

సౌతాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కి గాయం కారణంగా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా దూరం అయ్యాడు.

సౌతాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కి గాయం కారణంగా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా దూరం అయ్యాడు. అతని స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కి జట్టులో చోటు లభించింది. బుమ్రా నడుము నొప్పితో భాదపడుతున్నాడని అందుకే అతడు టెస్ట్ సిరీస్ కి దూరం అయినట్లు బీసీసీఐ వెల్లడించింది. బుమ్రా గత వెస్టిండీస్‌ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ రెండు నుండి ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది . టీమిండియా టెస్టు జట్టు వివరాలు ఇలా ఉన్నాయి..

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే(వైఎస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మన్ గిల్‌



Show Full Article
Print Article
More On
Next Story
More Stories