వెస్టిండీస్ తో సిరీస్‌ కి భారత జట్టు ఎంపిక

వెస్టిండీస్ తో సిరీస్‌ కి భారత జట్టు ఎంపిక
x
Highlights

రెండు ఫార్మట్ లోను కోహ్లి కెప్టెన్ గా ,రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా కొనసాగుతారు. ఇక రెండు ఫార్మట్ లకి గాను ఎంపిక చేసిన టీంలో

వచ్చే నెలలో వెస్టిండీస్ జట్టుతో జరగబోయే వన్డే, టీ 20 సిరీస్ లకి గాను భారత జట్టును ఎంపిక చేశారు సెలక్టర్లు.. కొలకత్తాలో సమావేశం అయిన సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు. రెండు ఫార్మట్ లోను కోహ్లి కెప్టెన్ గా ,రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా కొనసాగుతారు. ఇక రెండు ఫార్మట్ లకి గాను ఎంపిక చేసిన టీంలో పెద్దగా మార్పులు లేవు.. వన్డే జట్టులో వాషింగ్టన్ సుందర్ స్థానంలో కేదార్ జాదవ్‌కు చోటు కల్పించారు. వెస్టిండిస్ జట్టుతో భారత్ మొదటి టీ20 మ్యాచ్ ని డిసెంబరు 6న ముంబైలో ఆడనుంది. ఇక తోలి వన్డే డిసెంబరు 15 న చెన్నైలో మొదలు అవుతుంది.

ఎంపిక చేసిన భారత జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

వన్డే జట్టు వివరాలు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్

టీ-20 జట్టు వివరాలు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories