కరోనా కట్టడికి పుల్లెల గోపీచంద్ రూ.26లక్షల విరాళం

కరోనా కట్టడికి పుల్లెల గోపీచంద్ రూ.26లక్షల విరాళం
x
Highlights

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాల చేస్తున్న ఈ పోరాటానికి సినీ తారలు,...

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాల చేస్తున్న ఈ పోరాటానికి సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు. పీఎం సహాయనిధితో పాటు రాష్ట్ర సీఎంల సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇక తాజాగా కరోనా వైరస్ కట్టడి కోసం జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ముందుకు వచ్చారు. గోపీచంద్ రూ. 26 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు.

రూ.11లక్షలను పీఎం-కేర్స్ నిధికి, రూ.10లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి, రూ.5లక్షలను ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్​కు అందించినట్టు సోమవారం వెల్లడించాడు. కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వాలకు ఓ చిన్న సాయం చేస్తున్నానని గోపీచంద్ చెప్పాడు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో గొప్పగా పని చేస్తున్నాయని, మార్గనిర్దేశకాలను పాటిస్తూ ఇంట్లో ఉంటూ సహకరిద్దామని ప్రజలకు పిలుపునిచ్చాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories