సొంతగడ్డపై బోణీ కొట్టిన సన్‌ రైజర్స్‌

సొంతగడ్డపై బోణీ కొట్టిన సన్‌ రైజర్స్‌
x
Highlights

ఐపిఎల్‌లో సొంతగడ్డపై సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం...

ఐపిఎల్‌లో సొంతగడ్డపై సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు సామ్సన్‌ 55 బంతుల్లో 102 అజేయ సెంచరీతో చెలరేగిపోయాడు. సామ్సన్‌ కు తోడు అజింక్య రహానె 49 బంతుల్లో 70 పరుగులు చేయడంతో.. రాజస్థాన్‌ రాయల్స్‌ 199 పరుగులు చేయగలిగింది.

అయితే 199 పరుగుల భారీ లక్షాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు 19 ఓవర్లకే టార్గెట్ ను ఛేదించింది. డేవిడ్‌ వార్నర్‌ 37 బంతుల్లో 69 పరుగులతో రాజస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడాడు, బెయిర్‌ స్టో 28 బంతుల్లో 48 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో వచ్చిన విజయ్‌ శంకర్‌ కూడా 15 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అయితే చివర్లో ఉత్కంఠ రేగినా యూసుఫ్‌ పఠాన్‌ 16 రన్స్‌, రషీద్‌ ఖాన్‌ కూడా 15 పరుగులతో సన్‌ రైజర్స్‌ జట్టుకు విజయాన్నందించారు. ఈ విజయంతో హైదరాబాద్ తన సొంత గడ్డపై మొదటి విజయాన్ని నమోదు చేసినట్లయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories