ఒక్కో మగాడు ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకపోతే జైలుకే!

ఒక్కో మగాడు ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకపోతే జైలుకే!
x
Highlights

ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నామంటారు మన దేశంలో భర్తలు.. పిల్ల దొరకట్లేదు పెళ్లి చేసుకుందామంటే వాపోతారు యువకులు.. కానీ, అక్కడ మాత్రం కనీసం రెండు...

ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నామంటారు మన దేశంలో భర్తలు.. పిల్ల దొరకట్లేదు పెళ్లి చేసుకుందామంటే వాపోతారు యువకులు.. కానీ, అక్కడ మాత్రం కనీసం రెండు పేళ్ళుళ్లన్నా చేసుకోకపోతే జైల్లో పెడతామని మగాళ్లని హెచ్చరిస్తున్నారు. ఒక్కోళ్లు కనీసం ఇద్దర్ని పెళ్లి చేసుకోవాలని చట్టం చేశారట. 5 గురిని పెళ్లి చేసుకుంటే ఆ ఐదుగురికి అక్కడి ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందట. ఇదేదో బావుందంటారా? సరే.. ఈ కథనం చదివి అవకాశం ఉంటె మీరూ అక్కడికి వెళ్లిపోండి..

ఆఫ్రికాలోని స్వాజిలాండ్ కు చెందిన రాజు మెస్వాతి-3 విచిత్రమైన ఆదేశాలు జారీచేశారు. దేశంలోని మేజర్ అయిన ప్రతీ పౌరుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఇందుకు 2019, జూన్ నెలను తుది గడువుగా నిర్ణయించారు.

ఈలోగా పెళ్లి చేసుకోకుంటే పురుషులు లేదా స్త్రీలకు యావజ్జీవ శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అయితే ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకునేవారికి పెళ్లి ఖర్చులతో పాటు ఆ భార్యలకు ఇళ్లను కూడా ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు.

ఆఫ్రికా దేశమైన స్వాజిలాండ్ లో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా అధికం. అందుకే ఈ దేశాన్ని కన్యల రాజ్యంగా అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలో స్త్రీ-పురుష జనాభా మధ్య సమతూకం కోసం ఒక్కొక్కరు కనీసం ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలని రాజాజ్ఞ జారీ అయింది. అన్నట్లు ఇంత కఠినమైన ఆదేశాలు జారీచేసిన మెస్వాతి-3కి 15 మంది భార్యలు, 25 మంది సంతానం ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఆ రాజ్యంలో విడాకులు తీసుకోవడం నేరం.

ఆదండి సంగతి.

Show Full Article
Print Article
Next Story
More Stories