యెస్ బ్యాంక్ కేసులో అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు

యెస్ బ్యాంక్ కేసులో అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు
x
Anil Ambani
Highlights

యస్‌ బ్యాంక్‌ వ్యవహారం అనిల్ అంబానీ మెడకు చుట్టుకుంది. యస్ బ్యాంక్ కేసు విచారణలో తమ ముందు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. యస్ బ్యాంక్ నుంచి...

యస్‌ బ్యాంక్‌ వ్యవహారం అనిల్ అంబానీ మెడకు చుట్టుకుంది. యస్ బ్యాంక్ కేసు విచారణలో తమ ముందు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. యస్ బ్యాంక్ నుంచి అనిల్ కు చెందిన కంపెనీ 12 వేల 800 కోట్లు రుణాలు పొందింది. అయితే ఇవి నిరర్థక ఆస్తులుగా మారడంతో అందుకు సంబంధించి ప్రశ్నించేందుకు అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ ఎదుట హాజరయ్యేందుకు తమకు కొంత సమయం కావాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా తను గడువు కోరారు. యస్ బ్యాంక్ ఇచ్చిన రుణాల వసూళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇటీవలే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అందులో అనిల్ అంబానీకి చెందిన గ్రూప్ కూడా ఉందని వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories