అప్పు తీర్చలేదని మహిళను కట్టేసి చెప్పులతో దాడి

అప్పు తీర్చలేదని మహిళను కట్టేసి చెప్పులతో దాడి
x
Highlights

కర్నాటకలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ మహిళను నడిరోడ్డుపై విద్యుత్‌ స్తంభానికి కట్టేసి అమానుషంగా ప్రవర్తించారు....

కర్నాటకలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ మహిళను నడిరోడ్డుపై విద్యుత్‌ స్తంభానికి కట్టేసి అమానుషంగా ప్రవర్తించారు. కొడిగిహళ్లిలో జరిగిన ఈ దారుణం కర్నాటకలో తీవ్ర సంచలనం రేపుతోంది. కర్నాటక చామరాజనగర్‌ జిల్లా కొడిగిహళ్లిలో చిన్న హోటల్‌ నడుపుకుంటోన్న రాజమణి స్త్రీ శక్తి పొదుపు సంఘం నుంచి 11లక్షల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా ఊరి నుంచి పారిపోయిందంటూ కొందరు గ్రామస్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. నెలరోజుల తర్వాత గ్రామానికి వచ్చిన మహిళను విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టారు. చెప్పులు, చీపుర్లతో కొడుతూ అవమానించారు.

అయితే అటుగా వెళ్తున్న వారంతా చోద్యం చూశారే తప్ప నిస్సహాయస్థితిలో ఉన్న బాధితురాలిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ దుర్మార్గులను ఆపేందుకు ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. ఈ దారుణాన్ని కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories