రోడ్డు ప్రమాదంలో పార్లమెంటు సభ్యుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో పార్లమెంటు సభ్యుడు దుర్మరణం
x
Highlights

అన్నాడీఎంకే పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ ఎంపీ రాజేంద్రన్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం విల్లుపురం సమీపంలో...

అన్నాడీఎంకే పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ ఎంపీ రాజేంద్రన్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం విల్లుపురం సమీపంలో ప్రమాదానికి గురైంది. దీంతో రాజేంద్రన్‌ అక్కడికక్కడే మృతిచెందినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఒక్కఓక్కరుగా ఆయన ఇంటికి చేరుకుంటున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories