వేలూరులో డీఎంకే అభ్యర్థి ఘనవిజయం

వేలూరులో డీఎంకే అభ్యర్థి ఘనవిజయం
x
Highlights

తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. అన్నా డీఎంకే అభ్యర్థి షణ్ముగంపై డీఎంకే అభ్యర్థి కతిర్‌ ఆనంద్‌ 8వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. అన్నా డీఎంకే అభ్యర్థి షణ్ముగంపై డీఎంకే అభ్యర్థి కతిర్‌ ఆనంద్‌ 8వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆనంద్‌కు 4,85,340 ఓట్లు రాగా, షణ్ముగం 4,77,199 ఓట్లు సాధించారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే వేలూరు లోక్‌సభకు ఏప్రిల్‌ 18న ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ పెద్ద ఎత్తున డబ్బు బయటపడటంతో కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఎన్నికను రద్దుచేసిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 5న ఈ స్థానానికి ఎన్నిక జరిగింది. ఏఐఏడీఎంకే, డీఎంకే అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories