చనిపోయిన వ్యక్తిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు..

చనిపోయిన వ్యక్తిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు..
x
Highlights

చనిపోయిన వ్యక్తికి ట్రాన్సఫర్‌ ఆర్డర్‌ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లో జరిగింది. జరిగిన పొరపాటుకు యూపీ డీజీపీ క్షమాపణలు చెప్పారు. వివరాలు.. సత్య...

చనిపోయిన వ్యక్తికి ట్రాన్సఫర్‌ ఆర్డర్‌ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లో జరిగింది. జరిగిన పొరపాటుకు యూపీ డీజీపీ క్షమాపణలు చెప్పారు. వివరాలు.. సత్య నారాయణ సింగ్‌ అనే వ్యక్తి డీఎస్పీగా పనిచేస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన నెల రోజుల క్రితమే మరణించాడు. అయితే చనిపోయే నాటికి అతను పని చేస్తున్నారు. ఈ క్రమంలోఇటీవల్ యూపీ పోలీసు ఉన్నతాధికారులు ట్రాన్సఫర్‌ లిస్ట్‌ తయారు చేశారు. ఇందులో మరణించిన సత్య నారాయణ సింగ్‌ పేరును కూడా చేర్చారు. ఆ తరువాత పొరపాటును గ్రహించారు.

జరిగిన ఈ పొరపాటుకు రాష్ట్ర డీజీపీ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ.. జాబితాను ప్రకటించారు. పొరపాటును గుర్తించిన 'ఈ రోజు ప్రచురించిన ట్రాన్సఫర్‌ లిస్ట్‌లో మరణించిన డీఎస్పీ సత్యనారాయణ పేరు ఉండటం చాలా బాధకరం. దాన్ని క్యాన్సల్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాను. కానీ ఇలాంటి తప్పులను సహించకూడదు. డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా ఈ విషయం గురించి క్షమాపణలు చెప్తున్నాను. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories