కాస్త వినడం నేర్చుకోండి.. లోక్ సభలో అమిత్ షా సీరియస్

కాస్త వినడం నేర్చుకోండి.. లోక్ సభలో అమిత్ షా సీరియస్
x
Highlights

జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ బిల్లుపై లోక్ సభలో వాడీ వేడీ గా చర్చ సాగింది. ఈ సందర్బంగా అమిత్ షా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం...

జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ బిల్లుపై లోక్ సభలో వాడీ వేడీ గా చర్చ సాగింది. ఈ సందర్బంగా అమిత్ షా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యుడు సత్యపాల్‌ సింగ్‌ బిల్లుపై ప్రసంగిస్తుండగా.. అసదుద్దీన్‌ మధ్యలో కల్పించుకుని మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇలా పదేపదే ఆయన ప్రసంగానికి అడ్డుతగలడంతో అమిత్‌ షాకు కోపం వచ్చింది.

దీంతో ఆయన ''సభ్యుడు మాట్లాడుతుండగా.. పదేపదే మధ్యలో ఎందుకు ఆటకం కలిగిస్తున్నారు అని ఒవైసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమిత్ షా. ప్రసంగాన్ని అప్పుడప్పుడు వినడం కూడా అలవాటు చేసుకో'' అంటూ ఘాటుగా క్లాస్‌ ఇచ్చారు. హైదరాబాద్ గురించి ఎదో చెప్పడానికి ప్రయత్నించిన ఒవైసీ.. స్పీకర్‌ కల్పించుకోవడంతో ప్రసంగాన్ని వింటూ కూర్చున్నారు. NIA సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories