సినిమా తరహాలో స్మగ్లింగ్

సినిమా తరహాలో స్మగ్లింగ్
x
Highlights

ఇద్దరు మహిళలు సినిమాలో చేసినట్టు్గానే స్మగ్లింగ్ కి పాల్పడ్డారు. వీళ్ల స్టోరీ వింటే తమిళ హీరో సూర్యా నటించిన 'వీడొక్కడే' సినిమా గుర్తొస్తుంది.

ఇద్దరు మహిళలు సినిమాలో చేసినట్టు్గానే స్మగ్లింగ్ కి పాల్పడ్డారు. వీళ్ల స్టోరీ వింటే తమిళ హీరో సూర్యా నటించిన 'వీడొక్కడే' సినిమా గుర్తొస్తుంది. అచ్చం ఆ సినిమాలో డ్రగ్స్ ను ఎలాగయితే కడుపులో దాచి పెట్టి స్మగ్లింగ్ చేస్తారో, ఇక్కడ వీళ్లు కూడా కళ్లకు కట్టినట్టుగా అదే చేసి చూపించారు. కోట్లలో విలువ చేసే మూడు కిలోల బంగారాన్ని శ్రీలంకకు చెందిన ఫాతిమా (46), తెరెసా (32) ఇద్దరు మహిళలు కడుపులో దాచి పెట్టుకుని చెన్నై ఏయిర్ పోర్ట్ లో దిగారు. వారి కడుపు పెద్దగా ఉండడం గమనించిన కస్టమ్స్ అధికారులు వారి మీద అనుమానంతో వాళ్లను ఆపి ప్రశ్నించారు. వాళ్లు చెప్పిన సమాధానాలతో అధికారులకు అనుమానం మరింత బలపడింది.

దీంతో అధికారులు వారిని పరిశీంచారు. అప్పుడు వారి కడుపులో ఉన్న బంగారం గుట్టు రట్టయింది. వెంటనే కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని బయటికి తీయించడానికి ఆస్పత్రికి తరలించే లోపే అనుకోని ట్విస్ట్ ఎదురయింది. మార్గమద్యంలోనే దాదాపు 10 మంది స్మగ్లర్లు ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశారు. వారి కడుపులో ఉన్న బంగారాన్ని మత్తు మందు ఇచ్చి తీసుకున్నారు. ఆ తరువాత మీనంబక్కం సమీపంలో ఆ ఇద్దరు మహిళలను వదిలి పారిపాయారు. అనంతరం ఆ ఇద్దరు మహిళలను గుర్తించిన పోలీసులు వారిని విచారించగా స్మగ్లర్లు ఎవరో మాకు తెలీదన్నారు. మత్తు మందు ఎక్కించి వారి కడుపులో ఉన్న బంగారాన్ని తీసుకున్నారని వారు స్పష్టం చేశారు. అసలు ఎవరు ఈ స్మగ్లర్లు , అనే విషయం తెలుసుకోవడానికి అటు పోలీసులు, ఇటు కస్టమ్స అధికారులు గట్టిగానే ప్రయత్నిస్తు్న్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories