సీఎం కేసీఆర్ తో ముచ్చటించిన ట్రంప్

సీఎం కేసీఆర్ తో ముచ్చటించిన ట్రంప్
x
సీఎం కేసీఆర్ తో ముచ్చటించిన ట్రంప్
Highlights

రాష్ర్టపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ ను...

రాష్ర్టపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ ను రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ ట్రంప్ కు పరిచయం చేశారు. ట్రంప్ తో కేసీఆర్ కరచాలనం చేసి ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, సీఎం కేసీఆర్ పాటు పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ట్రంప్‌ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విందులో శాకాహారం, మాంసాహారంతో వివిధ రకాల వంటకాలను సిద్ధం చేశారు. మాంసాహారాన్ని ఇష్టపడే ట్రంప్‌కు ప్రత్యేకంగా వంటలు సిద్ధం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories