ముగిసిన అమెరికా అధ్యక్షుడి పర్యటన.. అమెరికా బయల్దేరిన ట్రంప్‌

ముగిసిన అమెరికా అధ్యక్షుడి పర్యటన.. అమెరికా బయల్దేరిన ట్రంప్‌
x
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత్‌ పర్యటన విజయవంతంగా ముగిసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత్‌ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ గౌరవార్థం ఇచ్చిన విందు అనంతరం అయినా నేరుగా ఎయిర్ పోర్టుకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి సతీమణి మెలనియాతో కలిసి అమెరికాకు విమానంలో పయనమైయ్యారు. ట్రంప్ భారత ప్రర్యటనలో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య, రక్షణ పలు అంశాలపై ఒప్పందం కుదిరింది.

అంతుకుముందు రాష్ర్టపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ ను రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ ట్రంప్ కు పరిచయం చేశారు. ట్రంప్ తో కేసీఆర్ కరచాలనం చేసి ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, సీఎం కేసీఆర్ పాటు పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ట్రంప్‌ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విందులో శాకాహారం, మాంసాహారంతో వివిధ రకాల వంటకాలను సిద్ధం చేశారు. మాంసాహారాన్ని ఇష్టపడే ట్రంప్‌కు ప్రత్యేకంగా వంటలు సిద్ధం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories